- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రెమెదెసివిర్’ డ్రగ్కు కేంద్రం ఆమోదం
by Shamantha N |

X
న్యూఢిల్లీ: కొవిడ్-19 పేషెంట్లకు ఎమర్జెన్సీగా వినియోగించేందుకు గిలియెడ్ సైన్సెస్ కంపెనీకి చెందిన యాంటీవైరల్ డ్రగ్ ‘రెమెదెసివిర్’కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాధారణ క్లినికల్ ట్రయల్స్లో కరోనా పేషెంట్లపై సానుకూల ప్రభావం చూపిస్తున్న మొదటి మందు ఇదే కావడం గమనార్హం. గతనెల ఈ డ్రగ్కు అమెరకా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చింది. అంతేకాదు, జపాన్ రెగ్యులేటరీ సంస్థలూ ఈ మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా, అత్యవసరంగా వినియోగించే మందుగా కొవిడ్-19 పేషెంట్లకు రెమెదెసివిర్ను వినియోగించేందుకు జూన్ 1న ఆమోదం తెలిపినట్టు డ్రగ్స్ కంట్రోలర్ జెనరల్ వెల్లడించారు.
Next Story