ఎక్సైజ్ దాడులు… మత్తు పదార్థాలు స్వాధీనం

by  |
ఎక్సైజ్ దాడులు… మత్తు పదార్థాలు స్వాధీనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నం, అబ్బాపూర్ గ్రామాలపై హైద్రాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం ఏకకాలంలో రెండు గ్రామాలలో కల్లుబట్టిలు నిర్వహించే ఇద్ధరు వ్యక్తుల ఇండ్లపై స్థానిక ఎక్సైజ్ పోలిసులతో కలిపి దాడులు చేశారు.

అభంగపట్నంలో గోపి గౌడ్ అను వ్యక్తి ఇంట్లో2.5 కిలోల అల్పజోలూం ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3లక్షల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. అబ్బపూర్ గ్రామానికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి వద్ధ కుడా కల్తీ కల్లు తయారికి వాడే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed