- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్ను వీడేది లేదు.. స్పష్టం చేసిన ఎమ్మెల్సీ సారయ్య
దిశ, వరంగల్ : రెండు రోజుల నుండి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పార్టీ మారుతున్నారని సోషల్ మీడియా వేదికగా వస్తున్న పుకార్లకు సారయ్య స్పందించారు. శుక్రవారం ఒక ప్రకటనలో తను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. రామసహాయం సురేందర్ రెడ్డి నా రాజకీయ గురువు, నన్ను సొంత కుటుంబ సభ్యునిలా చూసుకున్నాడని అన్నారు. ఆయన కుమారుడు రఘురాం రెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ వస్తే మర్యాద పూర్వకంగా కలిసేందుకు ఖమ్మం వెళ్లానని. ఆర్ఎస్, నాది గురు శిష్యుల బంధం, రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ లో నాయకుడిగా ఎదగడంలో సురేందర్ రెడ్డి పాత్ర కీలకం అని కష్ట నష్టాల్లో వెన్నుదన్నుగా తనకు నిలిచారని అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలుసు సారయ్య ఎలాంటి వాడొనని, మర్యాద పూర్వకంగా కలిస్తే పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం సరైంది కాదని, నేను భారాసను వీడేది లేదని ఎంపీ ఎన్నికల్లో భారాస అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తానని తేల్చి చెప్పారు.