స్టార్ నటుడు మిస్సింగ్.. నాలుగు రోజుల తర్వాత బయటపడ్డ నిజం.. తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్..!

by Disha Web Desk 9 |
స్టార్ నటుడు మిస్సింగ్.. నాలుగు రోజుల తర్వాత బయటపడ్డ నిజం.. తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తారక్ మెహతా కా ఉల్టా చష్మా అనే హిందీ సీరియల్ నటుడు గురు చరణ్ సింగ్ గత నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో ఇండస్ట్రీలో టెన్షన్ మొదలైంది. దీంతో చరణ్ సింగ్ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సోమవారం ఉదయం 8. 30 గంటలకు ఇండి నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాడని, కానీ ముంబైకి వెళ్లలేదని, ఇంటికి కూడా తిరిగి రాలేదని తెలిపారు. చరణ్ ఫోన్ కూడా కలవట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతను మానసికంగా స్థిరంగా ఉన్నాడని, మేము అతని కోసం వెతికామని, కానీ చరణ్ కనిపించలేదని తెలిపారు. చివరిసారిగా ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ అనే టీవీ షోలో రోషన్ సింగ్ సోధి రోల్‌లో కనిపించాడని వెల్లడించారు. తన తండ్రి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల టీవీ షో నుంచి తప్పుకున్నడన్నాని చరణ్ తల్లిదండ్రులు ఢిల్లీలోని పాలం పోలీస్ స్టేషన్‌లో నిన్న(ఏప్రిల్ 25) మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed