అనంతపురంలో ఘోరం.. భర్త ఎదుటే భార్య మరొకరితో శృంగారం..!

by Mahesh |
Illegal affair
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రశాంతమైన సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. హ్యాపీ లైఫ్‌లోకి పరాయి వ్యక్తులు చొరబడి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ కళ్లు మూసుకోని ప్రవర్తించింది. పర పురుషుడి మైకంలో పడి లోకాన్నే మరిచి కామ క్రీడలు సాగించింది. చివరకు ఒకరు జైలుకు, మరొకరు కాటికి వెళ్లి పిల్లలను దిక్కులేని వారిని చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన శివశంకర్‌కు పదేళ్ల క్రితం సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన హేమలత(28)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. శివశంకర్ ఆటో నడుపుతుండగా.. హేమలత పిల్లలతో ఇంట్లోనే ఉంటుంది. భర్త ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుతూ వారిని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. అయితే ఇంటి వద్దే ఉండే భార్య.. కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రామాంజనేయులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

భర్త ఆటో తీసుకొని బయటకు వెళ్లగానే రామాంజనేయులు ఆమె ఇంట్లో దూరేవాడు. ఇద్దరు లోకాన్ని మరిచి కామక్రీడలు సాగిస్తుండటాన్ని గ్రామస్తులు గమనించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న భర్త.. పద్ధతి మార్చుకోవాలని హేమలతను హెచ్చరించాడు. పిల్లలు అయ్యాక ఇలాంటి పాడు పనులు చేయవద్దని, కుటుంబం ఆగం అవుతుందని ఆమెకు నచ్చజెప్పాడు. అయినా భర్త మాటలను పట్టించుకోని ఆమె.. రామాంజనేయులుతో తన సంబంధాన్ని కొనసాగించింది.

బుధవారం రాత్రి భర్త ఇంటికి వచ్చే సరికి ఆమె రామాంజనేయులుతో కామక్రీడలు సాగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కింది. వారిద్దరిని ఆ స్థితిలో చూసిన శివశంకర్ తీవ్ర ఆగ్రహానికి గురై పక్కనే రోకలి బండతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రామాంజనేయులపై దాడి చేసే క్రమంలో అతడు అక్కడి నుంచి పరుగు అందుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. కోపం తగ్గిన తర్వాత మామ(తన భార్య తండ్రి)కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. తన కళ్లేదుటే హేమలత శృంగారంలో పాల్గొనడాన్ని చూసి తట్టుకోలేకే హత్య చేశానని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి పోలీస్ స్టేషన్‌‌కు, తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు దిక్కు తోచని స్థితిలో గుండెలు అలిసేలా ఏడుస్తూ కూర్చుకున్నారు.



Next Story