మంచినీళ్ల కోసం లేచి కుప్పకూలాడు!

by  |
మంచినీళ్ల కోసం లేచి కుప్పకూలాడు!
X

దిశ, రంగారెడ్డి: విధుల్లో ఉన్న ఓ హోంగార్డుకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. గండేడ్ మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన నాగరిగారి అశోక్ గౌడ్(37) వికారాబాద్ జిల్లా పరిగి అగ్నిమాపక కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులాగే శనివారం మధ్యాహ్నం కూడా భోజనం చేశాడు. అనంతరం మంచినీరు తాగాలనుకుంటూ లేచి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి ఉందంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అశోక్ గౌడ్ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య సంధ్య, కూతరు, బాబు ఉన్నాడు.


Next Story

Most Viewed