కొత్త యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ విడుదల చేసిన హోండా!

by Harish |
avtiva
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) మంగళవారం తన ప్రీమియం ఎడిషన్ యాక్టివా 125ను విడుదల చేసింది. రూ. 78,725(ఎక్స్‌షోరూమ్)తో ప్రారంభమయ్యే ఈ స్కూటర్ రెండు ట్రిమ్‌లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. డ్రమ్ అలాయ్ వేరియంట్ రూ. 78,725 కాగా, డిస్క్ వేరియంట్ రూ. 82,280కి లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

‘దేశీయ మార్కెట్లో హోండా యాక్టివా లాంచ్ అయినప్పటి నుంచి ఈ బ్రాండ్ స్కూటర్ విభాగంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. తాజాగా ప్రీమియం ఎడిషన్ ప్రారంభించడం ద్వారా తమ ఉత్పత్తి నాణ్యతను కొనసాగిస్తుంది. కొత్త యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ కొత్త ఫీచర్లతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే లుక్‌తో కొత్త కస్టమర్లను ఆకరిషిస్తుందని నమ్ముతున్నామని’ హెచ్ఎంఎస్ఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అట్సుషి ఒగాటా అన్నారు. భారత మార్కెట్లోకి వినియోగదారులకు అన్ని రకాల వినియోగానికి, అవసరాలను తీర్చే వాహనంగా ఉంటుందని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ పేర్కొన్నారు. కొత్త ప్రీమియం ఎడిషన్ ద్వారా ఈ మోడల్‌లో మెరుగైన డిజైన్, మెరుగైన రంగుల్లో ప్రీమియం అనుభూతిని వినియోగదారులకు ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Next Story

Most Viewed