భద్రాచలంలో రూ.2కోట్ల గంజాయి పట్టివేత

by  |
భద్రాచలంలో రూ.2కోట్ల గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1,415 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.రెండు కోట్లు విలువ ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. అంతేగాకుండా అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనం సీజ్ చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed