పాఠశాల పుస్తకాల కోసం నిధులు విడుదల

by Shyam |
పాఠశాల పుస్తకాల కోసం నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాల పుస్తకాలను కొనుగోళు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. బడ్జెట్‌లో పాఠశాలల నిర్వహణ కోసం కేటాయించిన నిధుల నుంచి రూ.16,88,2300లను విడుదల చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పాఠాశాల విద్యార్ధులందరికి ఆన్ లైన్ ద్వారానే పాఠాలను బోధిస్తున్నారు. మొదటగా బ్రిడ్జి కోర్స్ ద్వారా గత ఏడాది పాఠాలు గుర్తుచేసే విధంగా భోదనలు కొనసాగుతున్నాయి. అనంతరం ఈ ఏడాది సిలబస్‌ను అధికారులు ప్రారంభించనున్నారు. నూతన సిలబస్ ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లను చేపట్టారు. పుస్తకాల కోసం కావాల్సిన నిధులను విడుదల చేసి సరైన సమయానికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed