శానిటైజర్ తాగి మరో నలుగురి మృతి

by  |
శానిటైజర్ తాగి మరో నలుగురి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో శానిటైజర్ తాగి మృతి చెందుతున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ సేవించి పదుల సంఖ్యలో బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తిరుపతిలో మరో విషాదం నెలకొంది. శానిటైజర్ తాగి నలుగురు మృతి చెందిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది. మృతులు వెంకటరత్నం, వీరయ్య, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఉండటం గమనార్హం.


Next Story

Most Viewed