విద్యుదాఘాతంతో రైతు మృతి

by Sridhar Babu |
Farmer dies
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్య రాజునాయక్(52) అనే రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. రోజూలాగే ఇవాళ కూడా పొలంలో మందు చల్లేందుకు వెళుతుండగా.. నేలపై పడి ఉన్న కరెంట్ తీగ కాలికి తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్లాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed