కరోనాతో ఆ దేశ ప్రధాని మృతి

by vinod kumar |
కరోనాతో ఆ దేశ ప్రధాని మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్రికాలోని ఎస్వతీనీ అనే దేశ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో లామిని (52) కరోనాతో మరణించారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారని ఎస్వతీనీ ఉప ప్రధాని తెంబా మసుకు ప్రకటించారు. కరోనా నుంచి కోలుకునేందుకు అంబ్రోస్‌ను దక్షిణాఫ్రికాకు తరలించినా.. చికిత్స పొందుతూ మరణించాడని తెంబా చెప్పుకొచ్చారు. అంబ్రోస్ 2018 నవంబరులో ఎస్వతీని ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.

Advertisement

Next Story