పేదలకు కాంగ్రెస్ అండ :ఎమ్మెల్యే సీతక్క

by Shyam |
పేదలకు కాంగ్రెస్ అండ :ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, వరంగల్: పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవెళలా అండగా ఉంటుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఏటూరునాగారం మండలం కపల్లి గ్రామంలోని చింతలమోరి గొత్తి కోయగూడెం ఆకలితో అలమటిస్తున్న ఆదివాసీలకు బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నివారించేందుకు ప్రజలు లాక్‌డౌన్ కు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, బాసాని విద్యాసాగర్, సొసైటీ డైరెక్టర్ వంగపండ్ల రవి యాదవ్, వినయ్, లాలూ, సర్ధార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

tags;mulugu,mla seethakka,essetinal goods,distribution

Advertisement

Next Story

Most Viewed