స్థానికులకే టీటీడీ దర్శనం టికెట్లు..

by srinivas |
స్థానికులకే టీటీడీ దర్శనం టికెట్లు..
X

దిశ, ఏపీబ్యూరో : డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు సంబంధించి తిరుమల సర్వదర్శనం టికెట్లు ఈనెల 24 నుంచి స్థానికులకు మాత్రమే జారీ చేస్తామని టీటీడీ ఈవో కేఎస్​ జవహర్ రెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల భక్తులు ఈ విషయం గమనించాలని ఆయన కోరారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10రోజుల పాటు సర్వ దర్శనం టికెట్లు జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కౌంటర్లను మంగళవారం ఆయన పరిశీలించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ..24 నుంచి ఈ కేంద్రాల్లో రోజుకు 10 వేల చొప్పున 10 రోజులకు లక్ష సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు 2 లక్షల టికెట్లు ఇప్పటికే ఆన్లైన్‌లో జారీ చేసినట్లు ఈవో తెలిపారు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి, శ్రీ వారి మెట్టు నడకదారులు, అలిపిరి రోడ్డు మార్గంలో అనుమతిస్తామన్నారు. భక్తులు టికెట్ లేకుండా వచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed