- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి

X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో వృద్ధ మహిళల కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు వృద్ధ మహిళలలను కిడ్నాప్ చేసి ఇంట్లో బంధించిన ఘటన అమీర్ పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. అమీర్పేటకు చెందిన అస్మత్ ఉన్సీసాబేగం, మహమ్మదీ అనే వృద్ధ మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో బంధించారు. ఇంట్లో ఉన్న వారు, గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి వారిని రక్షించారు. అనంతరం ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఇక తమకు సంబంధించిన కీలక మైన భూమి పత్రాలతో పాటు కొంత బంగారాన్ని దుండగులు లాక్కెళ్లారని బాధితులు పోలీసులకు తెలిపారు. కిడ్నాప్కు పాల్పడిన ప్రధాన నిందితుడితోపాటు మరో నలుగురిపై కేసు నమోదుచేశారు. ఆస్తికోసం మిరాజ్ అనే వ్యక్తి వారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Next Story