సభలో ఫొటోలు తీసిన హరీష్ రావు... చర్యలు తీసుకుంటామన్న స్పీకర్

by M.Rajitha |
సభలో ఫొటోలు తీసిన హరీష్ రావు... చర్యలు తీసుకుంటామన్న స్పీకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ హౌస్​ఫొటోలు తీయడం సభ నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. సభను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్​నాయకులు చూస్తున్నారని విమర్శించారు. శాసన సభ సమావేశాలు జరుగుతుండగా నిబంధనలు విరుద్ధం హౌజ్​లో హరీశ్​రావు ఫొటోలు తీయడాన్ని తప్పుబట్టారు. పదేండ్లు ప్రభుత్వంలో ఉండి, మంత్రిగా, శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసినటువంటి హరీశ్​రావు శాసన సభ లాబీలో నినాదాలు, ఎమ్మెల్యే ఎంట్రెన్స్ పాయింట్​దగ్గర ధర్నా చేయడం ఎంత వరకు కరెక్టు అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఫొటోలు అన్నింటిని కూడా బయట ప్రపంచంలోని గ్రూపులల్లోకి పంపారని, ది ఎస్టేట్​దాంట్లో కూడా పోస్టు చేసి, సభను తప్పదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సభ ఆరణలో కానీ, లోపల కానీ స్పీకర్​అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని పార్లమెంట్​రూల్స్​బుక్​ప్రకారం.. పోటోగ్రాఫ్, ఫీల్మ్​గ్రాఫ్​ ఆర్​స్కెచ్​వేయడం నిషేధం నిబంధన ఉన్నా.. హరీశ్​రావు గత రాత్రి ఫొటోలు తీశారని స్పీకర్​దృష్టికి తెచ్చారు.

శాసన సభకు సంబంధించి సాంప్రదాయాలను పక్కనపెట్టి బీఆర్ఎస్​నాయకత్వం సభలో చేపట్టిన నిర్వాహకంపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్​ను కోరారు. బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్​చైర్​అంటే లెక్కలేదు.. సీఎం అంటే ఈర్శ్య భావం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై నింధరోపణలు.. ఈ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు ప్రయత్నాలు తప్పా మరొకటి లేదని ఆది శ్రీనివాస్​పేర్కొన్నారు. పదిహేను నెలల కాలంలో సర్కారు చేపట్టిన పాలసీలను ఈ సభ ద్వారా ప్రజలకు తాము తెలియజేస్తుంటే.. బీఆర్ఎస్​నేతలు రన్నింగ్ కామెంట్రీ ద్వారా అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. సభలో ఫొటోలు తీసిన విషయమై వినతి పత్రం కూడా ఇచ్చామని, తగు చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్​ఈసందర్భంగా స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​ను కోరారు. కాగా, ఈ విషయాన్ని ఎగ్జామిన్​చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పీకర్​తెలిపారు. సంప్రదాయాలను, గౌరవాలను, ప్రతిష్టను పెంచాలంటే.. అలాంటి కార్యక్రమాలు చేయవద్దని సభముఖంగా సభ్యులందరికీ స్పీకర్​విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed