- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం కంచర్లగూడెంలో మల్లన్న దేవుడి గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. నూతన ఆలయాల నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత కొరకు ప్రతి ఒక్కరు దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు.
Next Story