HYDERABAD : విలేకరిపై కత్తులతో దాడి చేసిన రౌడీ షీటర్లు

by Maddikunta Saikiran |
HYDERABAD : విలేకరిపై కత్తులతో దాడి చేసిన రౌడీ షీటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో నిన్న అర్థరాత్రి ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లికి చందిన ఒక యూట్యూబ్ విలేకరిపై రౌడీ షీటర్ల బృందం క్రూరంగా దాడి చేసింది. కాగా .. రిపోర్టర్ మూబీన్ , రౌడీ షీటర్ సోహెల్ యొక్క అరాచకాలను తన‌ యూట్యూబ్‌లో టెలిక్యాస్ట్ చేసాడు . దీంతో కోపం పెంచుకున్న సోహెల్ , మూబీన్‌పై దాడి చెయ్యాలని నిచ్చయించుకున్నాడు.

ఈ క్రమంలో...సోహెల్, అతని గ్యాంగ్ అర్ధరాత్రి మూబీన్‌పై కత్తులతో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు. అతనిపై సోహెల్ గ్యాంగ్ దాడి చేసే క్రమంలో స్థానికులు వారిని అడ్డుకోగా, వారిపై కూడా సోహెల్ గ్యాంగ్ దాడి చేశారు .ఇప్పుడు నా చేతి నుండి తప్పించుకున్నావు, ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తానంటూ సోహెల్ గ్యాంగ్ మూబీన్ కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారు.జరిగిన ఘటన గురించి స్థానికులు అతని కుటుంబీకులకు సమాచారం అందించారు.దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు అర్ధరాత్రి ముబీన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా యూట్యూబ్ విలేకరిపై జరిగిన దాడికి జర్నలిస్ట్ సంఘాలు సంఘీభావం తెలిపాయి.

Next Story

Most Viewed