మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ‘దిశ’

by  |
మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ‘దిశ’
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఎస్. ధోని చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన దిశ పటాని.. తన స్టన్నింగ్ లుక్స్, యాటిట్యూడ్, టాలెంట్‌తో అభిమానులను భారీగా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ గార్జియస్ హీరోయిన్.. ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ది టైమ్స్ పత్రిక నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 సర్వేలో టాప్ ప్లేస్ కొట్టేసింది దిశ.

అభిమానుల ఓట్లు, జ్యూరీ.. విన్నర్‌ను డిసైడ్ చేయగా, 40 ఏళ్ల వయసుకు తక్కువగా దేశవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీస్, ఫీల్డ్స్‌కు చెందిన ప్రతిభ గల మహిళలతో పోటీపడిన దిశ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ 2019 రన్నరప్ సుమన్ రావు సెకెండ్ ప్లేస్‌లో నిలవగా.. కత్రినా కైఫ్ థర్డ్ ప్లేస్, దీపికా పదుకొనే నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాత వర్తికా సింగ్, కియారా అద్వానీ, శ్రద్ధ కపూర్, యామీ గౌతమ్, అదితి రావు హైదరి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దిశ.. అభిమానులకు థాంక్స్ చెప్పింది. ఫిట్‌గా ఉంటాను కాబట్టే, ఫ్యాన్స్ తనకు ఓటేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలబెట్టారని వారికి ధన్యవాదాలు తెలిపింది.


Next Story

Most Viewed