ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

by vinod kumar |
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. గత కొద్దిరోజుల నుంచి చాలా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 99 కొత్త కేసులు నమోదు కాగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో -70, రంగారెడ్డి జిల్లాలో -7, మేడ్చల్ జిల్లాలో- 3, నల్లగొండ జిల్లాలో -2, మహబూబ్ నగర్, జగిత్యాల్, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఒక కేసు చొప్పున నమోదైనట్లు నిర్ధారణ అయ్యింది. 12 మంది వలస కూలీలకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 2891 కు చేరుకోగా అందులో 1526 మంది బాధితులు ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. 1273 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా తాజాగా మరో నలుగురు వైరస్ కారణంగా మృతిచెందగా ఇప్పటివరకు మొత్తం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 92కు పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed