ప్రియురాలి గొంతు కోసిన ఢిల్లీ బాబు

by srinivas |
ప్రియురాలి గొంతు కోసిన ఢిల్లీ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పెనుమూరు మండలం ఎంపరాళ్ల కొత్తూరు వద్ద గాయత్రి అనే యువతి గొంతు కోసి ఢిల్లీ బాబు అనే యువకుడు పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ప్రేమ వ్యవహారంలో గొడవలతోనే దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయత్రిని హత్య చేయడంపై ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పూతలపట్టు మండలం చింతమాకులపల్లిలోని నిందితుడి ఇంటిపై దాడి చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Next Story

Most Viewed