వారిపైనా చర్యలు తీసుకోవాలి

by  |
వారిపైనా చర్యలు తీసుకోవాలి
X

దిశ, సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గం వెలూర్‌లో దళిత రైతు బ్యాగరి నర్సింహులు ఆత్మహత్య‌కు కారకులైన సర్పంచ్, తహసీల్దార్, వీఆర్వోలను అరెస్టు చేయాలని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట దళితులు ధర్నా చేశారు.

కేవలం సర్పంచ్‌పై కేసు నమోదు చేశారని.. వీఆర్వో, తహసీల్దార్‌పై కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ధర్నా అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో నాయకులు పి.శంకర్, కరికె శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్, బైరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed