ఒకరి ప్రాణం తీసిన రూ.20

by  |
ఒకరి ప్రాణం తీసిన రూ.20
X

దిశ, వెబ్‌డెస్క్: 20 రూపాయల కోసం జరిగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరి ప్రాణాలను తీసింది. క్షణికావేశంలో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన రూపేశ్ స్థానికంగా ఉన్న బార్బర్ షాపులో జుట్టు కట్టింగ్ చేయించుకున్నాడు. కట్టింగ్‌కు రూ.50 కాగా తన దగ్గర ఉన్న రూ.30 ఇచ్చి మిగతా రూ.20 తర్వాత ఇస్తానని షాపు యజమాని సంతోష్‌కు చెప్పాడు. దానికి అంగీకరించని సంతోష్ ఆ రూ.20 కూడా వెంటనే ఇవ్వాలని పట్టుబట్టాడు. సంతోష్‌కు తోడుగా ఆయన సోదరుడు సరోజ్ కూడా వచ్చి రూపేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ముగ్గురి మధ్య మాటామాటా పెరగడంతో రూపేశ్‌పై ఆ ఇద్దరు సోదరులు కర్రతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా సోమవారం మృతి చెందాడు. ఈ దాడి ఈనెల 24న జరగగా నేడు ఫిర్యాదు అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.


Next Story