- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి
X
దిశ, జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మండలం బోదవాడ గ్రామం అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ కు సంబంధించిన పేలుళ్ల సంఘటనలో సుమారు 16 మంది కార్మికులకు గాయాలయ్యాయి అందులో ఆరుగురికి తీవ్ర గాయాలు అవటంతో వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్ర మరియు మణిపాల్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగ్గయ్యపేట మండలం బోదవాడ గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్, పరిటాల అర్జునులు అనే కార్మికులు మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన కార్మికులు అదే గ్రామానికి చెందడంతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. నందిగామ డీసీపీ రవి కిరణ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
Advertisement
Next Story