సీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో.. గోడకు కన్నం వేసి మరి..

by Rajesh |   ( Updated:2024-03-05 06:59:47.0  )
సీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో.. గోడకు కన్నం వేసి మరి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో దొంగలు రెచ్చి పోయారు. పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో మొబైల్ షాప్‌లో చోరీకి పాల్పడ్డారు. తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్‌లో శ్రీ వెంకటేశ్వర మొబైల్స్ షాప్‌లో సోమవారం రాత్రి షాపు వెనుక భాగంలో కన్నం వేసి చోరికి పాల్పడ్డారు. షాప్‌లో నుంచి నాలుగు లక్షల నగదు, 20 స్మార్ట్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్టు యజమాని తెలిపారు. జనవరి 25న వెంకటేశ్వర మొబైల్స్‌లో షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు.

సోమవారం రాత్రి అగంతకులు తిలక్ గార్డెన్ వైపుగల మొబైల్ షాప్ గోడ వెనుక భాగం‌కు రంధ్రం చేసి అందులో నుంచి చిన్న పిల్లలను పంపించి చోరీ చేసినట్టు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ స్వయంగా రాత్రివేళ పెట్రోలింగ్ బాధ్యతలను పర్యవేక్షిస్తుండగా ఆయన క్యాంపు కార్యాలయానికి సమీపంలో చోరీ జరగడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు అక్కడ చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ రప్పించి ఆనవాళ్లు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed