బిల్డింగ్‌పై నుండి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి

by Rajesh |
బిల్డింగ్‌పై నుండి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి
X

దిశ, నిజామాబాద్ సిటీ : బిల్డింగ్‌పై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడం విషాదం నింపింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదవ టౌన్ పరిధిలోని వర్ని రోడ్ సాయి నగర్‌లో చోటు చేసుకుంది. సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఇందల్వాయి మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నూతనంగా నిర్మిస్తున్న భవనం ఒకటవ అంతస్తులో పైపు‌తో నీరు కొడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి కింద పడడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story

Most Viewed