- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన మరో కారు..
X
దిశ, కొండపాక : ఆగి ఉన్న కారును మరో కారు ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం, మేదినిపూర్ స్టేజి వద్ద బుధవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే హైదరాబాద్ కు చెందిన మల్లేశం, మహేష్, పర్వతాలు కారులో కొమరవెల్లి దేవస్థానానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మెదిన్ పూర్ స్టేజి వద్ద అదుపుతప్పి రోడ్డుపక్క నిలిచి ఉన్న కారుకు ఢీ కొట్టింది. దాంతో ముందున్న రెండు కార్లకు వరుసగా ఢీ కొనడంతో కార్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాదు నుంచి వస్తున్న కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది గణేష్, మల్లేశంకు ప్రథమ చికిత్స చేసి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story