హైదరాబాద్‌లో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-07-30 07:58:45.0  )
హైదరాబాద్‌లో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం
X

దిశ, సికింద్రాబాద్: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. మహిళ డయల్ 100 నంబర్‌కు కాల్ చేయడంతో విషయం వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్‌లో ఓ మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఈ బస్‌లో కృష్ణ, సిద్దయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ వెంటనే డయల్ 100 నంబర్‌కు కాల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు బస్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమచారం. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

కాగా, హైదరాబాద్ వనస్థలిపురంలోనూ ఈ రోజు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసే యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. హోటల్‌కు తీసుకెళ్లి మద్యం తాగి ఆమెపై అత్యాచారం చేసినట్లు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఓవైపు విచారణ జరుగుతుండగానే మరోవైపు కదులుతున్న బస్సులో అత్యాచారం చేయడం కలకలం సృష్టిస్తోంది.

Advertisement

Next Story