ఓయో హోటల్ లో మహిళ ఆత్మహత్య కలకలం

by Sridhar Babu |
ఓయో హోటల్ లో మహిళ ఆత్మహత్య కలకలం
X

దిశ, మేడిపల్లి : ఓయో హోటల్ లో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ గోవిందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీకి చెందిన బసిరి కవిత(39), ఆమె భర్త సంతోష్ కు మధ్య గొడవల కారణంగా నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కవిత తన భర్తకు ఎన్నిసార్లు ఫోన్​చేసి కలిసి ఉందామని కోరినా ఆయన ఒప్పుకోలేదు. దాంతో ఆమె మానసికంగా కృంగిపోయి ఈనెల 20న మేడిపల్లిలోని ఓయో హోటల్ కు వచ్చి రూమ్ తీసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి మోహన్ రావు ఫిర్యాదు మేరకు ఆమె భర్త సంతోష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించామని మేడిపల్లి సీఐ తెలిపారు.

Advertisement

Next Story