- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పబ్బుల్లో అసాంఘిక కార్యకలాపాలు.. బంజారాహిల్స్ లోని పబ్పై టాస్క్ ఫోర్స్ దాడి
దిశ, ఖైరతాబాద్ : బంజారాహిల్స్లోని ఓ పబ్ పై అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. పబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్ కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్కు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటు న్నారన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
దాడి చేసిన సమయంలో పబ్లో మెుత్తం 140 మంది యువతీ ,యువకులు ఉండగా వారందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. పబ్లో నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఆరోపణలు రాగా.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.