అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

by Kalyani |
అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారం మార్కెట్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని 108కు స్థానికులు సమాచారం అందించగా అక్కడ చేరుకున్నా 108 సిబ్బంది సదరు వ్యక్తిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు స్పష్టం చేశారు.

మరణించిన వ్యక్తి పసుపు రంగు గీతలు ఉన్న నలుపు రంగు చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించాడని వయసు సుమారుగా 45-50 సంవత్సరాల మధ్య ఉండవచ్చునని వివరించారు. చనిపోయిన వ్యక్తి చెత్త కాగితాలు సేకరించేవాడని స్థానికులు వివరించారని తెలిపారు. బాటసింగారం కారోబార్ పొడెశెల పెంటయ్య ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed