నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు దుర్మరణం

by Sridhar Babu |
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు దుర్మరణం
X

దిశ, సైదాపూర్ : నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ స్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎలబోయిన చైతన్య-సురేష్ దంపతుల ఎకైక కుమారుడు ఎలబోయిన ప్రజ్ఞాన్ కు రెండేళ్లు. మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న నీటి సంపులో పడి దుర్మరణం చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో బాలుడి తల్లిదండ్రుల రోదన గ్రామస్తులను కలిసివేసింది.

Next Story

Most Viewed