వేములవాడ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి

by Satheesh |   ( Updated:2022-12-27 15:01:11.0  )
వేములవాడ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి
X

దిశ, చందుర్తి: మండలంలోని మూడపల్లి గ్రామ శివారులోని పోచమ్మ ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నలుగురు యువకులు కారులో రాత్రి దాదాపు 11 గంటల సమయంలో వేములవాడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మూడపల్లి గ్రామ బస్టాండ్ సమీపంలోని పోచమ్మ ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తోట మహేష్, కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన మనోజ్, దిలీపులను చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో దిలీప్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed