ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీ

by Sridhar Babu |
ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీ
X

దిశ, గంగాధర : ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గంగాధర మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మడ్లపెల్లి ప్రణయ్, లోకిని అంజయ్యకు చెందిన బైకులు ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గంగాధరకు చెందిన మడ్లపెల్లి ప్రణయ్ ఎగిరి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆయన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. లోకిని అంజయ్యతో పాటు మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story