ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..

by Sumithra |
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా, గంగలూరు పోలీస్టేషన్ పరిధిలోని ఆండ్రి అడవుల్లో గురువారం ఉదయం నుంచి మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ కూడా మృతి చెందినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఎన్ కౌంటర్ లో 210 బెటాలియన్, డీఆర్జీ, కోబ్రా ఎస్టీఎఫ్ కు చెందిన బలగాలు పాల్గొన్నాయి. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల గురించి బలగాలు గాలిస్తున్నాయి.

Next Story

Most Viewed