కారు బోల్తా… వృద్ధుడు మృతి

by Kalyani |
కారు బోల్తా… వృద్ధుడు మృతి
X

దిశ, చేగుంట : కారును అతి వేగంగా నడుపుతూ డివైడర్ ను ఢీ కొట్టడంతో కారు బోల్తా పడిన ఘటనలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన నార్సింగి మండల పరిధిలోని వల్లూరు 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ అహ్మద్ మొహినోద్దిన్ తెలిపిన వివరాల ప్రకారం… మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కత్తెర నరసింహులు (80) అనారోగ్యంతో ఉండడంతో శస్త్ర చికిత్స నిమిత్తం నార్సింగి చారి ఆసుపత్రికి కారులో వస్తున్నారు. కత్తెర నర్సింలు కుమారుడు యాదగిరి కారును అతి వేగంగా నడుపుతూ వల్లూరు శివారులో అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. కత్తెర నరసింహులు కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతి చెందిన నర్సింలు మృతదేహాన్ని పోస్టుమార్టం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అహ్మద్ మొహీనుద్దీన్ తెలిపారు.

Next Story

Most Viewed