Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

by Shiva |
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు స్పాట్‌లోనే దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రం (Tamilnadu State)లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మినీ వ్యాన్‌లో కొంతమంది యాత్రికులు తిరుచెందూర్‌ (Tiruchendur)లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే తిరుగు ప్రయాణంలో వారు ఉలుందూర్‌పేట (Ulundurpet) శివారులోకి చేరుకోగానే మినీ వ్యాన్ అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Next Story

Most Viewed