ప్రమోషన్ కోసం ఏఆర్ ఎస్సై కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

by Javid Pasha |
ప్రమోషన్ కోసం ఏఆర్ ఎస్సై కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఫేక్ మావోయిస్టు ద‌ళం ఏర్పాటు, హెడ్ కానిస్టేబుల్ హ‌త్యకు కుట్ర ప‌న్నిన ఏఆర్ ఎస్ఐ కుట్రను పోలీస్ అధికారులు భ‌గ్నం చేశారు. ములుగు జిల్లాలో ఏఆర్ ఎస్సైగా ప‌నిచేస్తున్న మాధ‌వ‌రెడ్డి ఫేక్ మావోయిస్టు యాక్షన్ టీంను ఏర్పాటు చేసి, వ‌రంగ‌ల్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపేలా.. ఆ త‌ర్వాత ఫేక్ మావోయిస్టు యాక్షన్ టీంను ఎన్‌కౌంట‌ర్ చేయించి డిపార్ట్‌మెంట్ అధికారుల మ‌న్నన‌లు పొందేలా ప‌న్నాగం ప‌న్నిన‌ట్లు స‌మాచారం. ఈమేర‌కు ఫేక్ మావోయిస్టు టీంతో ములుగు జిల్లా తాడ్వాయి అడ‌వుల్లో ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా నిర్వహించిన‌ట్లుగా తెలుస్తోంది.

వ‌రంగ‌ల్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపేందుకు ప‌క్కాగా స్కెచ్ గీసిన ఏఆర్ ఎస్సై కుట్రను ములుగు జిల్లా పోలీసు అధికారులు భ‌గ్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాధ‌వ‌రెడ్డితో పాటు మ‌రో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ర‌హ‌స్యంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే విష‌యంపై దిశ ప్రతినిధి ములుగు జిల్లా పోలీసు అధికారుల‌ను వివ‌ర‌ణ కోరే ప్రయ‌త్నం చేయ‌గా.. అలాంటిందేం లేద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed