కారు బోల్తా ఒకరు మృతి...ముగ్గురికి తీవ్రగాయాలు

by Kalyani |
కారు బోల్తా ఒకరు మృతి...ముగ్గురికి తీవ్రగాయాలు
X

దిశ, కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామ శివారు మునిగేపల్లి సమీపంలోని జాతీయ రహదారి 365 బిబి పై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి సర్వీస్ రోడ్డు వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు,హైవే పెట్రో సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం నగరం అజీజ్ గల్లి కాలనీ, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు హైదరాబాద్ లో శనివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై, తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కూసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామ శివారు మునిగేపల్లి జాతీయ రహదారి సమీపంలో వారు ప్రయాణిస్తున్న TS 04-EF -6776 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి బోల్తా పడింది.

కారులో ప్రయాణిస్తున్న సయ్యద్ మొయినుద్దీన్ అలీ ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ వద్ద ఉన్న జామా మసీద్ ఇమామ్ గా ఉన్న మొయినుద్దీన్ అలీ (57) అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ షఫీ పరిస్థితి విషమంగా ఉంది. కుర్జహాన్, హమీద్ ఖాన్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న హైవే పెట్రో సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను 108 ,1033 హైవే పెట్రో అంబులెన్స్ సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్ర మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూసుమంచి ఎస్సై నాగరాజు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story