సత్తుపల్లిలో భారీ చోరీ..50 తులాల బంగారం మాయం

by Aamani |
సత్తుపల్లిలో  భారీ చోరీ..50 తులాల బంగారం మాయం
X

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని గాంధీనగర్ 4 లో నివసిస్తున్న ఆర్ అండ్ బి ఉద్యోగి ఇంట్లో సుమారు 50 తులాల బంగారం 40, వెండి 30. నగదు చోరీ కి గురి అయింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ రోడ్ నెంబర్ .4 లో నివసిస్తున్న ఆర్ అండ్ బి ఉద్యోగి ఎండీ గులామ్.ఫహిముద్దీన్ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం ఖమ్మం వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉంది.

బీరువాలో బట్టలు చిందరవందరగా చేసి బీరువాలో ఉన్న సూమారు 50 తులాల బంగారం, 40 తులాల వెండి, 30 వేల నగదు చోరీ కి గురి అయినట్లు గురించారు. స్థానిక సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు ను సేకరించిన పోలీసులు కల్లూరు ఏసీపీ ఏ రఘు, పట్టణ సీఐ టీ కిరణ్ తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఖమ్మం నుంచి క్లూస్ టీమ్ ను రప్పిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed