బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు సజీవదహనం

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-08 13:11:49.0  )
బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని తిరువూర్‌ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా గోడౌన్‌( fireworks godown)లో పేలుడు(Massive explosion) సంభవించింది. మంటల్లో చిక్కుకొని ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గోడౌన్ ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. అంతేకాదు.. పేలుడు ధాటికి 10 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed