- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాచుపల్లిలో గంజాయి గ్యాంగ్ అరెస్ట్

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రగతినగర్ మిథిలానగర్ లోని ఏపీజే అబ్దుల్ కలాం జీహెచ్ఎంసీ పార్క్ లో శనివారం కొందరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బాచుపల్లి సబ్ ఇన్ స్పెక్టర్ పార్క్ వద్దకు వెళ్లగా అనుమానాస్పదంగా పార్క్ లో తారసపడిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
కంభం వేణుగోపాల్ రెడ్డి, అరవపల్లి దుర్గాప్రసాద్, జరపాల ప్రశాంత్ నాయక్, కసిన తనుజ్ నాగ కుమార్, కొంగర సాయిబాలాజీకి పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లుగా తేలింది. వారికి కంభం వేణుగోపాల్ రెడ్డి గంజాయి విక్రయించినట్లుగా గుర్తించి వారి వద్ద ఉన్న 60 గ్రాముల గంజాయితో పాటు స్కూటీ, ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. గౌలిదొడ్డికి చెందిన గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్టు కంభం వేణుగోపాల్ తెలిపాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.