రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

by Shiva |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
X

దిశ, రాయికల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రాయికల్ మండలం వడ్డెర కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్ మండలం వీవీరావు పేటకు చెందిన కలాలి నర్సయ్య తన వ్యక్తిగత పని నిమిత్తం బైక్ పై కడెం మండలం లక్ష్మిసాగర్ గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన నర్సయ్య రాయికల్ మండలం వడ్డెర కాలనీ వద్దకు రాగానే ఎదురుగా అతివేగంతో వస్తున్న ట్రాక్టర్ నర్సయ్య బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు కలాలి నడిపి రాజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ఇటీవలే చనిపోగా.. కుమారుడు దుబాయిలో ఉంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed