- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చేపల వేటకు వెళ్లి విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి...
by Aamani |
X
దిశ, కోదాడ : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన కోదాడ పరిధిలోని అనంతగిరి రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ కేపీ చారి తెలిపిన వివరాల ప్రకారం... అనంతగిరి రోడ్డు కు చెందిన గుడిమల్ల సతీష్ చేపలు పట్టుటకు తన భార్య అపర్ణ, బావమరిది జంపాల భద్రయ్య మరికొందరితో కలిసి అనంతగిరి రోడ్డులో గల పెద్ద చెరువు అలుగు వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న కరెంట్ తీగ తగిలించి పట్టుకుని చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన భార్య, బావమరిది భద్రయ్య కోదాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం సమయంలో మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడి భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఆయన తెలిపారు.
Next Story