ఘోరం.. డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

by Kavitha |
ఘోరం.. డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
X

దిశ, మేడ్చల్ టౌన్: డివైడర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున జగద్గిరిగుట్టకు చెందిన మజ్జి శ్రీకాంత్, మున్నూరు నరేష్ తమ ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపు వెళ్తుండగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి మసీదు వద్ద డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన నరేష్‌ను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed