దినకర్మలకు వెళ్లివస్తూ అనంత లోకాలకు

by Sridhar Babu |
దినకర్మలకు వెళ్లివస్తూ అనంత లోకాలకు
X

దిశ, మిడ్జిల్ : దినకర్మలకు వెళ్లివస్తూ మురుగు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలం చిలువేరు గ్రామంలో చోటు చేసుకుంది. మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు విరాల ప్రకారం.. చిలువేరు గ్రామానికి చెందిన బొల్గం కృష్ణయ్య గౌడ్(33) బుధవారం సాయంత్రం గ్రామంలోని తన బంధువుల దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం కార్యక్రమం ముగించుకొని ఇంటికి వెళ్తున్నానని బయలుదేరాడు.

ఈ క్రమంలో ఎంతకీ కృష్ణయ్య గౌడ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో గురువారం ఉదయం మురుగు కాలువలో పడి చనిపోయి ఉన్నాడు. మురుగు కాల్వ ఉప్పొంగడంతో ప్రమాదవశాత్తు కృష్ణయ్య గౌడ్ కాలువలో పడి మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed