అత్తారింటికి వెళ్లి వచ్చేలోగా అంతా దోచేశారు...

by Sridhar Babu |
అత్తారింటికి వెళ్లి వచ్చేలోగా అంతా దోచేశారు...
X

దిశ, లోకేశ్వరం : ఇంటికి తాళం వేసి భార్యా పిల్లలను తీసుకురావడానికి అత్తారింటికి వెళ్లిన వ్యక్తి ఇంట్లో దొంగలుపడి నగదు, బంగారం అపహరించిన ఘటన లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ దిగంబర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని హవర్గ గ్రామానికి చెందిన తుంగినోల గంగాధర్ అనే వ్యక్తి ఈనెల 15న సాయంత్రం ఇంటికి తాళం వేసి దసరా పండుగకు అత్తగారి ఇంటికి భార్య పిల్లలను తీసుకురావడానికి జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామానికి వెళ్లాడు.

తిరిగి గురువారం ఉదయం ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉండడం గమనించాడు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో దాచిన రూ.లక్ష 30 వేల నగదుతో పాటు 12 గ్రాముల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లినట్లు లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏఎస్ఐ దిగంబర్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story