తాగుడు కోసం అప్పులు...తీర్చలేక తిప్పలు

by Sridhar Babu |
తాగుడు కోసం అప్పులు...తీర్చలేక తిప్పలు
X

దిశ,జన్నారం : తాగుడు కోసం అప్పులు చేసి వాటిని తీర్చలేక ఉసురుతీసుకున్న ఘటన ఇది. దస్తురాబాద్ మండలం మున్యాల్ గ్రామానికి చెందిన ఎమునూరి రాజు (26) శనివారం కలమడుగు గోదావరి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జన్నారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రాజు తాగుడుకు బానిసయ్యాడు. పనిచేస్తానని కొందరి వద్ద డబ్బులు తీసుకొని చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

డబ్బులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి మందలించారు. దాంతో రాజు మూడు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లి కలమడుగు గోదావరి ఒడ్డున గుర్తు తెలియని పురుగుల మందు తాగి మృతి చెందాడు. మృతుని తల్లి యమునిరి రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story