ఆన్లైన్ బెట్టింగ్‌కు ఏఆర్ కానిస్టేబుల్ బలి.. తుపాకితో కాల్చుకుని అక్కడికక్కడే మృతి

by Kavitha |
ఆన్లైన్ బెట్టింగ్‌కు ఏఆర్ కానిస్టేబుల్ బలి.. తుపాకితో కాల్చుకుని అక్కడికక్కడే మృతి
X

దిశ, యాచారం (ఇబ్రహీంపట్నం): ఆన్ లైన్ బెట్టింగ్‌కు బానిసైన యువ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలానికి చెందిన దూసరి బాలకృష్ణ గౌడ్, కలెక్టరేట్ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా ఆన్లైన్లో బెట్టింగ్‌‌లకు బానిసైన కానిస్టేబుల్.. ఆర్థికంగా ఒత్తిడికి గురై విధులు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు ముగించుకొని వాష్ రూమ్‌కి వెళ్లి తాళం వేసి తన సర్వీస్ గన్‌తో కాల్చుకొని అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed