బొలెరో,బైక్ ఢీ.. ఒక్కరు మృతి

by Aamani |
బొలెరో,బైక్ ఢీ.. ఒక్కరు మృతి
X

దిశ,కేటిదొడ్డి : ధరూర్ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామ శివారులో బొలెరో వాహనాన్ని బైక్ బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. కేటి దొడ్డి మండలం ఇర్కిచేడు తండా గ్రామానికి చెందిన రవీందర్ నాయక్ (23) ఆదివారం కొత్తపాలెం వద్ద పొలం పనులకు వెళ్లాడు. పని మీద కోతుల గిద్ద స్టేజ్ కి వెళ్లి తిరిగి కొత్తపాలెంకు వెళ్లుతుండగా కొత్తపాలెం శివారులో అల్వాల్ పాడు వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని బైకు ఢీ కొట్టింది. దీంతో రవీందర్ నాయక్ సంఘటన స్థలంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధరూర్ ఎస్సై అబ్దుల్ షుకూర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed